జగిత్యాల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూతగాదా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల మండలంలోని సంగంపల్లి గ్రామంలో భూ తగాదా విషయంలో ఘర్షణ పడి జాలపల్లి రవి (50), అతని భార్య మల్లవ్వ పై అదే గ్రామానికి చెందిన పత్తిపాక బాపన్న (50) కర్రతో దాడి చేశాడు. రవి అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్య మల్లవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ మల్లవ్వను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
కొన్ని రోజులుగా వారి ఇద్దరి మధ్య ఇంటి దారి విషయంలో గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్ఐ చిరంజీవి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ను రద్దు చేస్తాం
నెక్కొండ పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయంతి ఉత్సవాలు
సెప్టెంబర్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?