ముంబై: ప్రతీ భారతీయ పౌరుడు హిందువేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందువులు, ముస్లింలు ఒకేరకమైన వారసత్వాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్నారు. పుణెకు చెందిన గ్లోబల్ స్ట్రాటెజిక్ పాలసీ ఫౌం డేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలివి గల ముస్లిం నేతలు ఛాందసవాదులకు వ్యతిరేకంగా నిలబడాలని కోరారు.