EC | దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. హర్యానా, జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు.
Assembly poll in J&K will be held in three phases, with voting on Sep 18, Sep 25, and Oct 1
Counting of votes on October 4 pic.twitter.com/XXvtq4ReEU
— ANI (@ANI) August 16, 2024
జమ్మూ కశ్మీర్లో మొత్తం మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక హర్యానా అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
Haryana to vote on October 1; counting of votes on Oct 4 pic.twitter.com/PHC4OWy8qR
— ANI (@ANI) August 16, 2024
ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ‘2024 లోక్సభ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ. ఆ ఎన్నికలు విజయవంతంగా, శాంతియుతంగా పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా యువత మొదలుకుని వృద్ధుల వరకు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ఎంతో చైతన్యం చూపించారు. ఈసారి వారు హింసను పక్కనపెట్టి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకే మొగ్గు చూపారు’ అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
జమ్మూ కశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని రాజీవ్ కుమార్ తెలిపారు. ‘జమ్మూ కశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 74 జనరల్, ఎస్సీ-7, ఎస్టీ-9. జమ్మూ కశ్మీర్లో మొత్తం 87.09 లక్షల మంది (జులై 25 నాటికి) ఓటర్లు ఉంటారు. ఇందులో 44.46 లక్షల మంది పురుషులు కాగా, 42.62 లక్షల మంది మహిళా ఓటర్లు. ఇక 3.71 లక్షల మంది మొదటి సారి ఓటర్లు, 20.7 లక్షల మంది యువ ఓటర్లు’ అని రాజీవ్ కుమార్ వివరించారు. ఓటర్ల తుది జాబితాను 19న అమర్నాథ్ యాత్ర ముగిన తర్వాత ఆగస్టు 20న ప్రకటించనున్నట్లు తెలిపారు.
Also Read..
Kolkata | దాడులు జరిగిన ఆరు గంటల్లోగా ఫిర్యాదు నమోదు చేయాలి.. ఆసుపత్రులకు కేంద్రం కీలక ఆదేశాలు
Doctors protest | మా డిమాండ్స్ వినకపోతే అత్యవసర సేవలు నిలిపేస్తాం : జూనియర్ డాక్టర్స్