గువాహతి: ఒక వరుడు ఫుల్గా మద్యం తాగి (Drunk Groom) పెళ్లిలో నిద్రపోయాడు. పెళ్లికొడుకుతో పాటు తండ్రి, అతడి కుటుంబ సభ్యులు కూడా మద్యం మత్తులో ఉన్నారు. దీనిని సహించలేకపోయిన వధువు పెళ్లి పీటలపై కూర్చొనేందుకు నిరాకరించింది. దీంతో ఆ పెళ్లి రద్దయ్యింది. విస్తూ పోయే ఈ సంఘటన అస్సాంలోని నల్బరీ జిల్లాలో జరిగింది. నల్బారి పట్టణానికి చెందిన ప్రసేన్జిత్ హలోయ్కు ఒక మహిళతో పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లి రోజున వరుడు ఫుల్గా మద్యం సేవించి వివాహ వేదిక వద్దకు వచ్చాడు. కారు నుంచి కిందకు దిగేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అనంతరం పెళ్లి మండపంలో సరిగా కూర్చొలేకపోయాడు. మద్యం మత్తులో ఉన్న అతడు పూజారి చేప్పే మంత్రాలు తిరిగి చెప్పలేకపోయాడు. చివరకు పెళ్లి మండపంలో అతడు నిద్రపోయాడు.
మరోవైపు వరుడు ప్రసేన్జిత్తోపాటు అతడి తండ్రి, 95 శాతం మంది వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కూడా పూర్తిగా మద్యం మత్తులో పెళ్లి వేదిక వద్దకు వచ్చారు. దీంతో అతడ్ని పెళ్లి చేసుకునేందుకు వధువు నిరాకరించింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక గ్రామ పెద్దను వధువు కుటుంబం సంప్రదించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు, అతడి కుటుంబం తీరు వల్ల పెళ్లి ఆగినందుకు నష్ట పరిహారం కూడా డిమాండ్ చేశారు. కాగా, తాగిన మత్తులో ఉన్న వరుడు పెళ్లి వేదిక వద్ద నిద్రపోయిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video: "Drunk" Groom Sleeps At His Own Wedding. This Happened Next https://t.co/e29q2ZgBBm pic.twitter.com/LEZgRtXbJc
— NDTV (@ndtv) March 11, 2023