Bomb Threat | దేశంలోని ప్రధాన నగరాలకు వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) నగరానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. నగరంలో ఆరు చోట్ల బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి బెదిరించారు. ఇంతలోనే ఢిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఢిల్లీలోని ఆర్కే పురమ్ (RK Puram)లో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (Delhi Public School)కు ఈ ఉదయం బెదిరింపులు వచ్చాయి. పాఠశాలలో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బెదిరింపు మెయిల్తో పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు చెప్పారు. బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. అయితే పాఠశాలలో ఎలాంటి పేలుడు పదార్థాలూ కనిపించలేదని వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
DPS RK Puram receives a threat mail that the school will be blown up with a bomb. The school has been vacated as a precautionary measure. Search by the Police is underway. Nothing found so far: Delhi Police
— ANI (@ANI) February 2, 2024
Also Read..
ముంబైలో ఆరు చోట్ల బాంబులు పెట్టాం.. పోలీసులు అప్రమత్తం
Champai Soren | జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం
Arvind Kejriwal | ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఐదో సారీ డుమ్మా