Mallikarjun Kharge | లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) ఇండియా కూటమి (INDIA Bloc) మెజారిటీ దిశగా దూసుకెళ్తోందని పసిగట్టిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నిరుత్సాహానికి గురవుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. అందుకే మంగళసూత్రం, ముస్లింలు (Muslims) అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఛత్తీస్గఢ్లోని జాంజ్గిర్-చంపా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘మేం మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నాం. అందుకే మోదీ మంగళసూత్రం, ముస్లింల గురించి మాట్లాడుతున్నారు. ప్రజల సంపదను దొంగిలించి ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి ఇస్తామని అంటున్నారు. పేదలకు ఎప్పుడూ ఎక్కువ మందే పిల్లలు ఉంటారు. పేదల వద్ద సంపద లేదు కాబట్టే అధిక సంతాన్ని కలిగి ఉంటారు. కానీ మీరు (ప్రధానమంత్రి మోదీని ఉద్దేశిస్తూ) ముస్లింల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు..? ముస్లింలకు మాత్రమే ఎక్కువ మంది సంతానం ఉంటారా..? ముస్లింలు కూడా ఈ దేశానికి చెందినవారే. నాకూ ఐదుగురు సంతానం. నా తండ్రికి నేను ఒక్కడినే. గతంలో జరిగిన అగ్నిప్రమాదంలో అమ్మ, చెల్లి, మరో బంధువు చనిపోయారు. మోదీ ప్రకటనలతో తప్పుదారి పట్టొద్దు. అందరినీ కలుపుకుని వెళితేనే దేశాన్ని అభివృద్ధి చేయగలం’ అని ఖర్గే అన్నారు.
Also Read..
Chiranjeevi | పసి పిల్లలను పని పిల్లలుగా చేయొద్దు.. మే డే సందర్భంగా చిరంజీవి స్పెషల్ వీడియో
Bomb Threat | ఢిల్లీ-ఎన్సీఆర్లో 60కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఉలిక్కిపడ్డ రాజధాని ప్రాంతం
China | చైనాలో కుప్పకూలిన రోడ్డు.. 19 మంది మృతి