చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం అధికార డీఎంకే తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 164 స్థానాల్లో డీఎంకే పోటీ చేయనున్నది. మిగతా 70 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. (Tamil Nadu Assembly polls) అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపిణీ గురించి సీఎం ఎంకే స్టాలిన్ శనివారం వెల్లడించారు. 164 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్కు 28 సీట్లు, డీఎండీకేకు 10, వీసీకేకు 8 స్థానాలు, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో 5 సీట్లు, ఎండీఎంకేకు 4, మిగతా సీట్లను చిన్న పార్టీలకు కేటాయించినట్లు వివరించారు.
కాగా, సీఎం ఎంకే స్టాలిన్ తన కొలత్తూరు నియోజకవర్గం నుంచే తిరిగి పోటీ చేయనున్నారు. ఆయన కుమారుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి చెపాక్-ట్రిప్లికేన్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇటీవల డీఎంకేలో చేరిన మాజీ సీఎం ఓ పన్నీర్సెల్వంకు కూడా తొలి జాబితాలో చోటుదక్కింది. బోడినాయకనూరు స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. కోయంబత్తూరు సౌత్ స్థానం నుంచి మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ బరిలోకి దిగుతున్నారు.
Also Read:
Watch: స్కూటీని రాసుకుని వెళ్లినందుకు.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను ధ్వంసం చేసిన మహిళ