DK Shivakumar | మరికొన్ని రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka state elections) జరగనున్నాయి. ఈ తరుణంలో కన్నడ స్టార్ నటుడు (Kannada movie star), ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) బీజేపీకి మద్దతు ప్రకటించడం హాట్టాపిక్గా మారింది. సుదీప్ బీజేపీలో చేరుతారంటూ ముందుగా ప్రచారం జరిగింది. అయితే, ఆ పార్టీలో చేరడం లేదని, ఈ ఎన్నికల్లో సీఎం బసవరాజ్ బొమ్మైకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. బసవరాజ్ బొమ్మైతో వ్యక్తిగతంగా తనకు సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. సుదీప్ నిర్ణయంపై ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తాజాగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. సినిమాలు, రాజకీయాలూ రెండూ వేర్వేరు అని అన్నారు.
‘సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండదు. చాలా మంది సినీ తారలు వస్తుంటారు.. పోతుంటారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరు. ఆ రెండింటికీ చాలా తేడా ఉంది. నిరాశలో కూరుకుపోయిన కమలం పార్టీ తన ప్రచారానికి ఇప్పుడు ప్రజలను కూడగట్టడం అసాధ్యం. అందుకే ఎన్నికల ప్రచారానికి కన్నడ నటుడిని రంగంలోకి దించింది’ అని ఆయన అన్నారు.
మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్కు 75, జేడీఎస్కు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి.
#WATCH | "I don't think there will be any impact on elections. So many film stars come and go, politics is different, films are different…..": Karnataka Congress chief DK Shivakumar on actor Kichcha Sudeep extending support to CM Basavaraj Bommai ahead of Assembly polls pic.twitter.com/Phc7EZSQVn
— ANI (@ANI) April 6, 2023
Also Read..
UAE | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారతీయుడికి రూ.11 కోట్ల పరిహారం.. యూఏఈ కోర్టు తీర్పు
Girl Swallows Phone | సోదరుడితో గొడవ.. సెల్ఫోన్ మింగేసిన యువతి
India Corona | అప్రమత్తంగా ఉండాల్సిందే.. భారీగా పెరిగిన కరోనా కొత్త కేసులు