Security check : జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో శనివారం రాత్రి ఇండియన్ ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో జిల్లా అంతటా ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆర్మీ జిల్లాలోని అన్ని రహదారులలో బలగాలను మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నది.
భారత వైమానిక దళం కాన్వాయ్పై శనివారం రాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వాయుసేనకు చెందిన ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ ఐదుగురు సైనికుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇండియన్ ఆర్మీ గత రాత్రి నుంచి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నది.
#WATCH | Poonch, J&K: Visuals of security checking by Indian Army personnel in the Poonch district.
An Indian Air Force vehicle convoy was attacked by terrorists in the Poonch district yesterday. One of the five Indian Air Force soldiers injured in the terrorist attack has… pic.twitter.com/0PjwhZ3GVX
— ANI (@ANI) May 5, 2024