Diamond Hub | గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయమైన ‘సూరత్ డైమండ్ బోర్స్’ (Surat Diamond Bourse) భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రేపు (డిసెంబర్ 17న) ప్రారంభించనున్నారు. డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీలో నిర్మితమైన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది.
దాదాపు 3,500 కోట్ల రూపాయల వ్యయంతో 35.54 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మించారు. ఈ డైమండ్ బోర్స్ 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 9 గ్రౌండ్ టవర్లు, 15 అంతస్తుల్లో దీని నిర్మాణం చేపట్టారు. 300 చదరపు అడుగుల నుండి 1 లక్ష చదరపు అడుగుల వరకు కార్యాలయ స్థలాలు ఉన్నాయి. డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్ కనెక్టడ్ భవనం. ఈ బిల్డింగ్లో సుమారు 4,700 కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం 130 కార్యాలయాలు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి. ఈ భవనం పెంటగాన్ కంటే పెద్దదని చెబుతున్నారు. ఇప్పుడు ఈ భవనం వజ్రాల వ్యాపారానిక ప్రపంచ కేంద్రంగా మారనుంది.
డైమండ్ బోర్స్ క్యాంపస్లో పలు కార్యాలయాలతోపాటు సేఫ్ డిపాజిట్ వాల్ట్లు, కాన్ఫరెన్స్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్, రెస్టారెంట్స్, బ్యాంకులు, కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్లు, ట్రైనింగ్ సెంటర్లు, ఎంటర్టైన్మెంట్, రెస్టారెంట్స్, సెక్యూరిటీతో పాటు క్లబ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
Also Read..
Mumbai Indians | రోహిత్ స్థానంలోకి పాండ్యా.. ముంబై ఇండియన్స్కి ఊహించని షాకిచ్చిన నెటిజన్స్
Vijay Diwas | విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు నివాళులు
Ratan Tata: రతన్ టాటాను బెదిరించిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు