న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శనివారం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్కు లేఖ రాశారు. దేశంలో ప్రజాస్వామ్యం రోజురోజుకు దెబ్బల బాధలకు గురవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్ మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆయనకు మద్దతుగా లేఖ రాశారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను లాక్కోవడానికి, నిర్బంధించడానికి కేంద్రం, దాని ప్రతినిధులు చేస్తున్న చర్యలను ఖండిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తమిళనాడు గవర్నర్కు వ్యతిరేకంగా ఇటీవల ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం స్టాలిన్కు మద్దతిస్తున్నట్లు తెలిపారు. అలాగే గవర్నర్లు, ఎల్జీలు తమ విధులను నిర్వర్తించేందుకు కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్రాన్ని కోరుతూ ఢిల్లీ అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం చేస్తామన్నారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో విచారణకు సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలో హాజరు కావాలని అందులో పేర్కొంది. అలాగే ఢిల్లీ ఎల్జీ సక్సేనా, ఆప్ ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా కొన్ని వర్గాలకు విద్యుత్ సబ్సిడీ కొనసాగింపు ఫైల్ ఆమోదంలో ఎల్జీ సక్సేనా ఆలస్యం చేశారు. పాలనాపరమైన అంశాల్లో ఆయన జోక్యం మితిమీరుతున్నది.
ఈ నేపథ్యంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని సోమవారం నిర్వహించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. సీఎంకు సీబీఐ సమన్లు జారీ చేయడంపై చర్చించనున్నారు. అలాగే కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపై కేసు నమోదు చేస్తామని కేజ్రీవాల్ హెచ్చరించారు. దీంతో దీనిపై కూడా అసెంబ్లీలో చర్చించనున్నారు.
We condemn the actions of Centre & its representatives to usurp & constrain powers of non-BJP State Govts. I support Shri @mkstalin's efforts. We will also table a resolution in Delhi Vidhan Sabha urging the Centre to fix time limits for Governors/LG to carry out their functions. pic.twitter.com/jHizPTmL0U
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 15, 2023
We will file appropriate cases against CBI and ED officials for perjury and producing false evidence in courts
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 15, 2023