New Delhi | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ (iPhone) కోసం ఓ మహిళా టీచర్ను ఇద్దరు బైకర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో సదరు టీచర్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
యోవికా చౌదరి (Yovika Chaudhary) అనే మహిళ సాకేత్ (Saket) ప్రాంతంలోని జ్ఞాన్ భారతి పాఠశాల (Gyan Bharti School)లో టీచర్గా పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి ఆటోలో ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో ఆమె చేతిలో ఐఫోన్ ఉండటాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు బైక్పై ఆటోను వెంబడించారు. టీచర్ చేతిలోని ఫోన్ను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో యోవికా ఆటోలో నుంచి కింద పడిపోయింది. అనంతరం ఫోన్ కోసం బైకర్లు ఆమెను అలాగే కొద్దిదూరం ఈడ్చుకెళ్లారు. చివరికి ఐఫోన్ను లాక్కుని దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యోవికా చౌదరిని స్థానికులు వెంటనే మాక్స్ సాకేత్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. ఈ ఘటనపై సాకేత్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టి.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Shimla | శివాలయంపై విరిగిపడ్డ కొండచరియలు.. 9 మంది మృతి
Uttarakhand | భారీ వర్షాలకు పేకమేడలా కూలిన కళాశాల.. వీడియో