Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (Delhi Lt Governor) వీకే సక్సేనా (VK Saxena) లెటర్ రాశారు. ఢిల్లీలో తాగునీటి సమస్యపై (water problems) బహిరంగ లేఖ రాశారు.
ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నగరంలో నీటి కొరత సమస్యలను పరిష్కరించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైందన్నారు. గత దశాబ్దకాలంగా నగరంలో మంచి నీటి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. నగరంలో నీటి సమస్య ఇప్పటికిప్పుడు వచ్చింది కాదన్నారు. ఏటా ఇదే సమస్య పునరావృతమవుతోందన్నారు.
ఈ మేరకు ఢిల్లీలో మంచి నీటి సమస్యపై 2017 నుంచి మీడియాలో వచ్చిన క్లిప్పింగ్స్ను లేఖకు జతచేస్తూ.. నగరంలో నీటి సమస్య తీవ్రతను వివరించారు. నీటి నిర్వహణ విషయంలో ఢిల్లీ కంటే చెన్నై (35 శాతం), ముంబై (27 శాతం), పూణే (35 శాతం) నగరాలు బెటర్గా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీ గతనెల అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
Also Read..
Surya Tilak | మరికాసేపట్లో అయోధ్య రాముడికి సూర్య తిలకం
MK Stalin | మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశం 200 ఏళ్ల వెనక్కి వెళుతుంది : సీఎం స్టాలిన్
Ram Navami | రామ్లల్లాకు దివ్యాభిషేకం.. అయోధ్యలో ఘనంగా నవమి వేడుకలు