Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సోమవారం అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని సందర్శించనున్నారు. ఇద్దరు ఆప్ సీఎంలు కుటుంబసమేతంగా అయోధ్యలో రామమందిరాన్ని సందర్శిస్తారు.
తాము జనవరి 22 తర్వాత కుటుంబసభ్యులతో కలిసి అయోధ్య రామాలయాన్ని సందర్శిస్తామని కేజ్రీవాల్ గతంలోనే వెల్లడించారు. ఇక కేజ్రీవాల్, భగవంత్ మాన్ సోమవారం రామాలయం సందర్శించి రామ్ లల్లా దర్శనం చేసుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరిస్తారు.
కాగా, జనవరి 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ సమక్షంలో వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. రామాలయ ప్రారంభోత్సవాన్ని ఆరెస్సెస్, బీజేపీ కార్యక్రమంగా మార్చేశారని విపక్ష నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
Read More :
Tamil Nadu | నాడు మిత్రులు.. నేడు శత్రవులు..! బీజేపీ-అన్నాడీఎంకే మధ్య వార్..!