Dawood Ibrahim | 1993లో ముంబై పేలుళ్ల సూత్రధారి, భారత మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన పలు ఆస్తులను అధికారులు వేలం వేయనున్నారు. మహారాష్ట్ర (Maharashtra) రత్నగిరి పరిధిలో ఉన్న ముంబాకే గ్రామంలో ఉన్న దావూద్ చిన్ననాటి ఇల్లు ( Childhood Home) సహా అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన పలు ఆస్తులను వేలం వేయనున్నారు. ముంబైలో శుక్రవారం ఈ వేలం జరగనున్నట్లు తెలుస్తోంది (Auctioned On Friday). ఈ మేరకు వేలం వేయనున్న ఆస్తులను దర్యాప్తు సంస్థలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
గడిచిన 9 ఏళ్లలో దావూద్, అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన 11 ఆస్తులను అధికారులు వేలం వేసిన విషయం తెలిసిందే. వాటిల్లో ఒక రెస్టారెంట్ను రూ.4.53 కోట్లు, ఆరు ఫ్లాట్లు రూ.3.53 కోట్లకు, గెస్ట్ హౌస్ రూ.3.52 కోట్లకు అమ్ముడుపోయాయి.
Also Read..
Coronavirus | దేశంలో 4,565కి పెరిగిన క్రియాశీల కేసులు.. కొత్తగా 573 మందికి కొవిడ్ పాజిటివ్
Jr NTR | జపాన్ భూకంపం ఘటనపై ఎన్టీఆర్ దిగ్భ్రాంతి.. గత వారం అక్కడే ఉన్నా అంటూ ట్వీట్
Lottery | లాటరీలో మిలియన్ డాలర్లు గెలుచుకున్న మహిళ.. పట్టరాని సంతోషంతో స్టేజ్పైనే పడిపోయి