Jr NTR | జపాన్ (Japan)ను వరుస భూకంపాలు (Earthquakes) వణికించిన విషయం తెలిసిందే. సోమవారం దాదాపు 155 సార్లు భూమి కంపించింది. ఈ భూకంపాల ధాటికి ప్రాణనష్టం తక్కువే అయినప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా. కాగా, జపాన్లో వరుస భూకంపాల ఘటనపై టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తాజాగా స్పందించారు. ఈ మేరకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ గతవారం కుటుంబంతో కలిసి వెకేషన్ కోసం జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. వ్యక్తిగత పర్యటన నిమిత్తం తారక్ జపాన్లో వారం రోజులపాటు గడిపారు. ఇక టూర్ ముగించుకొని సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఇంతలోనే అక్కడ వరుస భూకంపాలు సంభవించాయన్న విషయం తెలుసుకున్న ఎన్టీఆర్.. సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘జపాన్ నుంచి ఇవాళే ఇంటికి తిరిగి వచ్చాను. గతవారం అంతా అక్కడే గడిపాను. జపాన్లో భూకంపం వార్త విని షాక్ అయ్యాను. ఆ ప్రాంతంలో భూకంపం రావడం నా హృదయాన్ని కలచివేసింది. అక్కడి ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Back home today from Japan and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week there, and my heart goes out to everyone affected.
Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong, Japan 🇯🇵— Jr NTR (@tarak9999) January 1, 2024
ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’లో నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే 80 శాతం మేర చిత్రీకరణ పూర్తయింది. దేవరలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. తొలి భాగం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Also Read..
NREGA | ఆధార్తోనే ఉపాధి హామీ వేతన చెల్లింపులు.. కొత్త ఏడాది క్రూరమైన కానుకని విపక్షం మండిపాటు
YS Sharmila | కాంగ్రెస్ పార్టీలో చేరనున్న షర్మిల.. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు!
South Korea | దక్షిణ కొరియా విపక్ష నేతపై కత్తితో దాడి.. తెగిన మెడ