సియోల్: దక్షిణ కొరియా (South Korea) ప్రతిపక్ష నేత, అధ్యక్ష అభ్యర్థి లీ జే మ్యూగ్పై (Lee Jae-myung) దుండగుడు దాడిచేశాడు. మంగళవారం ఉదయం బుసాన్లో పర్యటనలో భాగంగా నిర్మాణంలో ఉన్న ఎయిర్పోర్ట్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతుండగా దుండగుడు ఒక్కసారిగా ఆయన మెడపై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మ్యూంగ్ వెంటనే కింపడిపోయారు. వెంటనే ఆయనను దవాఖానకు తరలించారు.
కాగా, దాడి అనంతరం పారిపోతుండగా అక్కడ ఉన్నవారు దుండగుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 20 నుంచి 30 ఇంచుల పొడవున్న కత్తితో దాడిచేసినట్లు అధికారులు తెలిపారు. దాడి తర్వాత 59 ఏండ్ల మ్యూంగ్ స్పృహలోనే ఉన్నారని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటనేది కచ్చితంగా చెప్పలేమన్నారు. 2022 ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ చేతిలో మ్యూంగ్ ఓడిపోయారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గత సెప్టెంబర్లో 24 రోజులపాటు నిరషన దీక్ష చేశారు.
The leader of the democratic party in South Korea was stabbed. Pray for peace pic.twitter.com/lNhzqAu5ba
— Mossad Commentary (@MOSSADil) January 2, 2024
#FrontlineBreaking: South #Korea opposition chief Lee Jae-myung was stabbed during a visit to the southern port city of #Busan on Tuesday. pic.twitter.com/AI8fmCw6fo
— CGTNFrontline (@FrontlineBJ) January 2, 2024