మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 27: ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయడంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిందని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం లాక్డౌన్ లో భాగంగా జిల్లా పోలీసు బందోబస్తును పర్యవేక్షించా రు. లాక్డౌన్ నిబంధనలను జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ఈనెల 12 నుంచి అమలవుతున్న లాక్డౌన్ ప్రశాంతంగా జరుగడం లో ప్రజలు చక్కగా సహకరించడం సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సం దర్భంగా చట్టాన్ని ధిక్కరించిన వ్య క్తులను గుర్తించి, ఇప్పటివరకు జిల్లా లో మొత్తం 11,746 కేసులు నమో దు చేశామని ఎస్పీ వెల్లడించారు. వీటిలో 385 కేసులు దుకాణాల యజమానులపై కాగా, మాస్కులు ధరించని వారిపై 7,288 ఆనవసరంగా రోడ్లపై తిరిగే వాహనాదారులపై 4,073 కేసులు నమోదయ్యాని తెలిపారు. మానవాళి అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మనమంతా క్రమశిక్షణ బాధ్యతాయుతంగా ఉంటూ మహమ్మారిపై విజయం సాధిద్దామని ఎస్పీ పిలుపునిచ్చారు.