విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్,మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు కీలక పాత్రల్లో క్రాంతి సైన తెరకెక్కిస్తున్న చిత్రం ‘కపటనాటక సూత్రధారి’. వెరైటీ కాన్సెప్ట్తో సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్డౌన్ తర్వాత చిత్ర విడుదలకు ప్లాన్ చేస్తుండగా, కొద్ది సేపటి క్రితం మూవీ ట్రైలర్ అశ్వినీదత్ చేతుల మీదుగా విడుదల చేయించారు.
చిత్ర ట్రైలర్ విడుదల చేసిన అశ్వినీదత్ ట్రైలర్ బాగుందని, సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. నిర్మాత మనీష్ మాట్లాడుతూ ‘‘మా ‘కపట నాటక సూత్రదారి’ సినిమా ట్రైలర్ నీ ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వినీదత్ గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతగా ఆయనే మాకు స్ఫూర్తి, మా దర్శకుడు క్రాంతి సినిమాను చాలా కొత్తగా ఆవిష్కరించాడు. ఇక సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయి ఫస్ట్ కాపీ సిద్దంగా ఉంది. సో త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.