కోల్కతా: ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు వచ్చింది. ఈ మేరకు రాసి ఉన్న స్లిప్ను టాయిలెట్లో సిబ్బంది గుర్తించారు. అధికారులను అలెర్ట్ చేశారు. దీంతో విమానంలోని ప్రయాణికులను ఖాళీ చేయించి తనిఖీ చేశారు. (bomb threat to IndiGo flight) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం 9.15 గంటలకు కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మేఘాలయ రాజధాని షిల్లాంగ్కు ఇండిగో విమానం బయలుదేరాల్సి ఉన్నది.
కాగా, విమానంలోకి ప్రయాణికులు ఎక్కిన తర్వాత బాంబు ఉన్నట్లు చేతితో రాసి ఉన్న బెదిరింపు స్లిప్ను టాయిలెట్లో సిబ్బంది గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ విమానాన్ని వెంటనే ఐసోలేషన్ బే వద్దకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికులను ఖాళీ చేయించారు. భద్రతా నిబంధనల మేరకు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసినట్లు ఇండిగో పేర్కొంది.
Also Read:
Air India fined | పర్మిట్ లేకుండా ఎయిర్బస్ నడిపిన ఎయిర్ ఇండియా.. కోటి జరిమానా
Thief Targeted Only Cops’ Homes | 15 ఏళ్ల కిందట కొట్టారని.. పగతో పోలీస్ ఇళ్లల్లో వ్యక్తి చోరీలు
Watch: రోజ్ డే రోజున భర్తను ఆశ్చర్యపరిచిన భార్య.. షాక్ ఇచ్చిన పోలీసులు