బెంగళూరు: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రోజూ మూడు లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో రోజువారీ కేసులు అత్యధికంగా నమోదవుతున్నప్పటికీ మిగతా రాష్ట్రాల్లోనూ కరోనా ఉధృతి తీవ్రంగానే ఉన్నది. కర్ణాటకలో రోజూ దాదాపు 10 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కర్ఫ్యూ విధించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప ప్రకటించారు. అదేవిధంగా అత్యవసర సేవల కోసం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలించనున్నట్లు తెలిపారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అయితే, భవన నిర్మాణ రంగం, తయారీ రంగంతోపాటు వ్యవసాయ రంగ పనులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్ ప్రధాని ఫోన్..!
రైల్లో వచ్చిన ఆక్సిజన్ ట్యాంకర్లు.. వీడియో
పోలింగ్ ఏజెంట్ టోపీపై మమతాబెనర్జి బొమ్మ..!
కరోనా ఎఫెక్ట్: శ్రీ హేమకుంద్ సాహిబ్ యాత్ర వాయిదా
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?
బెంగాల్లో ప్రశాంతంగా పోలింగ్..!