డెహ్రాడూన్: కరోనా మహమ్మారి దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దాంతో వివిధ రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యగా నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు వంటి కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. పలు రాష్ట్రాలు బ్యూటీ పార్లర్లు, బార్బర్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేశాయి. మరికొన్ని రాష్ట్రాల్లో మరోసారి ప్రార్థన మందిరాలకు భక్తుల ప్రవేశంపై నిషేధం విధించారు.
తాజాగా ఉత్తరాఖండ్లో ఏటా జరిగే శ్రీ హేమకుంద్ సాహిబ్ యాత్రపై కూడా కరోనా మహమ్మారి దెబ్బ పడింది. కరోనా విస్తృతి కారణంగా ఈ సారి హేమకుంద్ సాహిబ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం హేమకుంద్ సాహిబ్ యాత్ర మే 10న ప్రారంభం కావాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
రైల్లో వచ్చిన ఆక్సిజన్ ట్యాంకర్లు.. వీడియో
పోలింగ్ ఏజెంట్ టోపీపై మమతాబెనర్జి బొమ్మ..!
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?
బెంగాల్లో ప్రశాంతంగా పోలింగ్..!
బెంగాల్ ఎన్నికలు: పోలింగ్ బూత్ నుంచి బీజేపీ ఏజెంట్ గెంటివేత..!