India Corona | దేశంలో (India) కరోనా వైరస్ (Cororna Virus) మళ్లీ కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల పెరుగుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో మరణాలు కూడా క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఐదు నెలల తర్వాత వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే అత్యధిక సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ క్రమంలో నేడు రాష్ట్రాలు, కేంద్ర పాలిక ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. వైరస్ కట్టడి, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దిశానిర్దేశం చేయనుంది. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. కాగా, దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది.
ఏప్రిల్ 10, 11 తేదీల్లో కొవిడ్పై మాక్ డ్రిల్..
దేశంలో కొవిడ్, సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో సన్నద్ధతను పరిశీలించేందుకు ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మాక్డ్రిల్లో అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను పాల్గొంటాయని పేర్కొంది. ఈ నెల 27న జరిగే వర్చువల్ మీటింగ్లో మాక్ డ్రిల్కు సంబంధించి ఖచ్చితమైన వివరాలను రాష్ట్రాలకు తెలుపుతామని అడ్వైజరీలో తెలిపింది.
Also Read..
Innocent | సినీ పరిశ్రమలో విషాదం.. మలయాళ హాస్యనటుడు మృతి
Gurudwara | గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు
Human sacrifice | ఉత్తరప్రదేశ్లో నరబలి కలకలం.. కొడుకు ఆరోగ్యం కోసం 10 ఏండ్ల బాలుడిని చంపాడు