లక్నో: ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) 10 ఏండ్ల బాలుడి నలబలి (Human sacrifice) ఘటన కలకలం సృష్టిస్తున్నది. మూఢనమ్మకాలతో బంధువే అతని గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. బహ్రైచ్ (Bahraich) జిల్లా పర్సా గ్రామానికి (Parsa village) చెందిన కృష్ణవర్మ (Krishna Verma) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతనికి వివేక్ వర్మ (Vivek Verma) అనే 10 ఏండ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు. కృష్ణవర్మకు అదే గ్రామంలో అనూప్ (Anoop) అనే ఓ బంధువు ఉన్నాడు. అనూప్కు రెండున్నరేండ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడు గత కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాయి. వైద్యం చేయించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో అనూప్.. ఓ తాంత్రికుడిని (Occultist) సంప్రదించాడు. నరబలి చేస్తే అంతా బాగుటుందని ఆ తాంత్రికుడు అతనికి చెప్పాడు. మంత్రగాడిన నమ్మిన అనూప్.. తప మేనమామ చింతారామ్తో కలిసి గురువారం రాత్రి వివేక్ వర్మను ఎత్తుకెళ్లాడు.
నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతుకోసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే వివేక్ కనిపించకుండా పోవడంతో అతని తండ్రి కృష్ణవర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాలుడికోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇంటికి సమీపంలోని పొలాల్లో వివేక్వర్మ మృతదేహం లంభించింది. హత్యకేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అసలు విషయం బయటపడింది. తాంత్రికుడి మాటలు నమ్మిన అనూప్.. వివేక్వర్మను నరబలి ఇచ్చినట్టు తేలింది. దీంతో మంత్రగాడితోపాటు అనూప్ను, అతనికి సహకరించిన చింతారామ్ను అరెస్టుచేశామని బరైచ్ ఎస్పీ ప్రశాంత్ వర్మ వెల్లడించారు.