ముంబై : కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన ఓ గల్లీ క్రికెటర్పై ముంబై సెషన్స్ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రికెటర్ మాస్కు ధరించకపోవడంతో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది కోర్టు. మహారాష్ర్టలో కరోనా కేసులు తీవ్రమవుతున్న క్రమంలో కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఖురేషి అనే యువకుడు కొంతమంది మైనర్లతో కలిసి కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై క్రికెట్ ఆడుతున్నారు. ఆ యువకులు కనీసం మాస్కు కూడా ధరించలేదు. అటుగా పోలీసులు వచ్చేసరికి భయపడి ఆ పిల్లలు పారిపోయారు. కానీ మొబైల్స్ మాత్రం మరిచిపోయారు.
దీంతో ఓ పోలీసు ఆ మొబైల్ను స్వాధీనం చేసుకున్నాడు. యువకుడు ఖురేషి.. ఓ మైనర్తో పోలీసుల వద్దకు వచ్చాడు. మొబైల్ను దొంగిలించేందుకు మైనర్ యత్నించడంతో.. పోలీసుకు గాయాలయ్యాయి. మొత్తానికి ఈ కథ కోర్టుకు చేరింది. ఖురేషితో పాటు మిగతా యువకులు మాస్కు ధరించకుండా, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి క్రికెట్ ఆడటాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. మైనర్ను వారి తల్లిదండ్రులకు అప్పగించగా, ఖురేషికి మాత్రం జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది.
ఇవికూడా చదవండి..