Manish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi Excise Policy Case)లో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia ) జుడీషియల్ కస్టడీ (judicial custody)ని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) మరోసారి పొడిగించింది. మద్యం పాలసీ, మనీలాండరింగ్ కేసులో సిసోడియాను సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా, కోర్టు ఆయనకు విధించిన కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సిసోడియాను పోలీసులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.
లిక్కర్ స్కాంలో సీబీఐ (CBI), ఈడీ (ED) వేర్వేరు కేసులతో దర్యాప్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ కేసులో సిసోడియా కస్టడీని ఏప్రిల్ 27వ తేదీకి, ఈడీ కేసులో ఏప్రిల్ 29వ తేదీ దాకా కస్టడీని పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిసోడియా కీలక పాత్ర పోషించారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్ట్ చేసింది. ఇక మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా సిసోడియాను విచారిస్తోంది.
Also Read..
Golden Temple | స్వర్ణదేవాలయంలోకి ఆ అమ్మాయికి నో ఎంట్రీ.. స్పందించిన ఆలయ కమిటీ
Apple BKC | రిచ్ లుక్లో ముంబై ‘యాపిల్ బీకేసీ’ రిటైల్ స్టోర్.. పిక్స్ వైరల్..!