Golden Temple | దేశంలోని (India) ప్రసిద్ధ ఆలయాల్లో పంజాబ్ (Punjjab) రాష్ట్రంలోని అమృత్సర్ (Amritsar) స్వర్ణ దేవాలయం (Golden Temple) ఒకటి. ఈ ఆలయం ప్రధానంగా సిక్కుల యాత్రా స్థలం (Sikh shrine). ఈ ఆలయాన్ని సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. కాగా, ఆలయంలోకి ప్రవేశించకుండా ఓ అమ్మాయిని అక్కడి నిర్వాహకులు తాజాగా అడ్డుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంసమైంది.
ఓ అమ్మాయి తన ముఖంపై దేశ త్రివర్ణ పతాకాన్ని (Indian flag) పెయింటింగ్గా వేసుకొని పవిత్ర సిక్కు మందిరం వద్దకు వచ్చింది. అయితే, అక్కడ ఉన్న గార్డు ఆమెను లోపలికి అనుమతించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అదికాస్తా వైరల్గా మారింది. ఈ అంశంపై శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (Shiromani Gurdwara Parbandhak Committee) స్పందించింది. ఘటనకు గానూ కమిటీ జనరల్ సెక్రటరీ గురుచరణ్ సింగ్ గరేవాల్ (Gurcharan Singh Grewal) క్షమాపణలు చెప్పారు.
‘గోల్డెన్ టెంపుల్ సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రతి మతపరమైన స్థలానికి దాని సొంత విధానాలు కలిగి ఉంటాయి. ఆలయంలోకి మేం ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నాము. ఎవరిపట్లైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే అందుకు క్షమాపణలు కోరుతున్నాం. అయితే, మహిళ ముఖంపై ఉన్న పెయింటింగ్ భారతీయ జెండా కాదు. అందులో అశోకచక్రం లేదు. అది రాజకీయ జెండా అయ్యి ఉండొచ్చు’ అని గురుచరణ్ సింగ్ (Gurcharan Singh Grewal) పేర్కొన్నారు.
1) A girl was stopped from entering Golden Temple because she had an Indian flag painted on her face.
The man who denied her entry into Golden Temple said, this is Punjab not India. pic.twitter.com/IfUi74poIk
— Anshul Saxena (@AskAnshul) April 17, 2023
Also Read..
Apple BKC | రిచ్ లుక్లో ముంబై ‘యాపిల్ బీకేసీ’ రిటైల్ స్టోర్.. పిక్స్ వైరల్..!
Bathinda Military Station | బఠిండా మిలిటరీ స్టేషన్లో కాల్పుల ఘటన.. సైనికుడి అరెస్ట్