IndiGo | దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ ఉద్యోగులందరికీ వన్ టైం స్పెషల్ బోనస్ ప్రకటించింది. 45 రోజుల బేసిక్ వేతనాన్ని స్పెషల్ బోనస్ గా వెల్లడించింది. ఎక్స్ గ్రేషియాగా మే నెల వేతనంతోపాటు సిబ్బందికి చెల్లించనున్నది.
‘కొవిడ్-19 మహమ్మారి వేళ కష్టకాలంలో తొలిసారి ఉమ్మడిగా కష్టపడి పని చేశాం. తర్వాత రికవరీ సాధించాం. రెండు సందర్భాలు ప్రతి ఒక్కరికి సవాళ్లు విసిరాయి. కొవిడ్ మహమ్మారి చూపిన ప్రభావం తర్వాతీ ఏండ్లలో వచ్చిన లాభాలను మింగేశాయి’ అని ఉద్యోగులకు రాసిన లేఖలో ఇండిగో తెలిపింది.
‘2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇండిగోలో 32,407 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2022 ద్వితీయార్థం నుంచి మేం రికవరీ ప్రారంభించాం. అప్పటి నుంచి పనితీరు మెరుగైంది’ అని సిబ్బందికి పంపిన ఈ-మెయిల్ సందేశంలో ఇండిగో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు, వైడ్ బాడీ విమానాలకు ఆర్డర్లతో భవిష్యత్ పురోగతికి బాటలు పడ్డాయి’ అని వ్యాఖ్యానించింది.