ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల (Mizoram Assembly Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను (Counting)లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 40 సీట్లున్న మిజోరంలో నవంబర్ 7న ఎన్నికలు జరిగాయి. మిగిలిన నాలుగు రాష్ట్రాలతోపాటు మిజోరంలోనూ ఆదివారమే ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉన్నప్పటికీ.. తమకు ప్రత్యేక దినమని, ఆ రోజు కౌంటింగ్ వద్దంటూ ఆ రాష్ట్ర ప్రజలు, పలు సంస్థలు చేసిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం కౌంటింగ్ ప్రక్రియను సోమవారానికి వాయిదా వేసింది. ప్రధానంగా అధికార ఎంఎన్ఎఫ్తోపాటు (MNF) జడ్పీఎం (ZPM), కాంగ్రెస్ పార్టీలు పోటీ పడ్డాయి.
ఈ ఎన్నికల్లో 174 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లలో 80.66 శాతం మంతి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాగా, ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర వ్యాప్తంగా 13 కేంద్రాలను ఏర్పాటుచేశారు. సుమారు 4 వేల మంది ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్నారు.
#WATCH | Counting of votes for #MizoramElections2023 has begun. Visuals from a counting centre in Aizawl. pic.twitter.com/ZkGZDziI9Z
— ANI (@ANI) December 4, 2023
#WATCH | Counting of votes for #MizoramElections2023 is underway. Visuals from a counting centre in Serchhip. pic.twitter.com/yaQzE5oqmj
— ANI (@ANI) December 4, 2023