జనవరి 31 వరకు లాక్డౌన్ ఆంక్షలు పొడిగింపు

ముంబై: దేశంలో కరోనా కొత్త రకం వైరస్ కేసులు నమోదవుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో లాక్డౌన్ను మరో నెలరోజులపాటు పొడిగించింది. జవవరి 31 వరకు లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉంటాయని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నది. వచ్చే నెల 5 వరకు పట్టణ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
కాగా, పుణేలో ఇప్పటికే ఒకరికి కరోనా కొత్త వైరస్ సోకింది. మొత్తం 50 మంది నమూనాలను పరీక్షించగా ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్కు తరలించారు. ఈనేపథ్యంలో యూకే నుంచి వస్తున్న వారిపై అధికారులు నిఘా పెంచారు.
దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,25,066 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 49,373 మంది మరణించగా, 55,672 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలోని ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 60 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయి. అందులో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
తాజావార్తలు
- రష్యా ఎస్-400 మిస్సైల్ కొనుగోళ్లపై అభ్యంతరం
- లాక్డౌన్తో ప్రాణాలను కాపాడుకున్నాం : ప్రధాని మోదీ
- తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
- కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
- రోహిత్ శర్మ ఔట్.. ఇండియా 62-2
- హార్ధిక్ పాండ్యా తండ్రి కన్నుమూత..
- హత్య చేసే ముందు హంతకుడు అనుమతి తీసుకుంటడా?
- పెళ్లిలో కన్నీరు పెట్టుకున్న వరుడు.. ఎందుకో తెలుసా?