మహబూబాబాద్ రూరల్, మే 8 : సీఎం రేవంత్రెడ్డి పేదలను మోసం చేస్తున్నారని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మహబూబాబాద్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ మాదిగలకు వ్యతిరేకమని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలోనే దళితులకు అన్ని విధాలా మేలు జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలకు అన్యాయం చేసిందని, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఒక్క ఎంపీ సీటు కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి మాదిగల పట్ల కక్షపూరిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మాదిగలు ఒక్క తాటి పైకి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి కావ్యను ఓడించాలని పిలుపునిచ్చారు.