ప్రచారం జోరందుకున్నది. ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో బీఆర్ఎస్ శ్రేణులు గడపగడపకూ వెళ్తున్నారు. కేసీఆర్ సర్కార్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్తిస్తున్నారు. బుధవారం జిల్లాలో గులాబీ శ్రేణులు చేపట్టిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రచారానికి వెళ్లిన నాయకులకు ఘన స్వాగం లభించింది. ఆరు గ్యారెంటీల పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు.