సిమ్లా: హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి సీఎం అభ్యర్థి ఎంపిక పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ఉన్న హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ మద్దతుదారులు రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ నేతల వాహనాలను అడ్డుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి తమ బలాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలైన రాజీవ్ శుక్లా, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భాఘేల్, హర్యానా మాజీ సీఎం భుపిందర్ హుడా కొత్త సీఎం ఎంపిక కోసం సిమ్లా చేరుకున్నారు. శుక్రవారం అక్కడి హోటల్లో పలువురు నేతలు, ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సీఎం ఎంపికపై వారి అభిప్రాయాలు విన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని ముగ్గురు నేతలు స్పష్టం చేశారు.
కాగా, కీలకమైన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి ముందు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ మీడియాతో మాట్లాడారు. తన భర్త అయిన దివంగత మాజీ సీఎం వీరభద్ర సింగ్ పేరు, ఆయన పనితీరు వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని విస్మరించలేరని, ఆ క్రెడిట్ను మరొకరికి ఇవ్వడం సరికాదని అన్నారు. తన కుటుంబాన్ని కాంగ్రెస్ హైకమాండ్ విస్మరించబోదని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో సీఎం ఎంపిక కోసం వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతల ముందు ప్రతిభా సింగ్ మద్దతుదారులు బలప్రదర్శన నిర్వహించారు. వారి వాహనాన్ని అడ్డుకుని సింగ్ కుటుంబానికి అనుకూలంగా నినాదాలు చేశారు.
#WATCH | Himachal Pradesh: State Congress chief Pratibha Singh's supporters gathered outside Oberoi Cecil hotel in Shimla showcasing their support to her while stopping Chhattisgarh CM Bhupesh Baghel's carcade. pic.twitter.com/jzGV2MmUud
— ANI (@ANI) December 9, 2022
"They can't neglect his (Virbhadra Singh) family. We won on his name, face & work. It can't be that you use his name, face & family & give credit to someone else. High Command won't do this," says HP Cong chief Pratibha Singh ahead of Legislative Party meet#HimachalElection2022 pic.twitter.com/PmxkjJ2ymD
— ANI (@ANI) December 9, 2022