న్యూఢిల్లీ: పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి చెందిన వ్యాపార సంస్థలు పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు హిండెన్బర్గ్ విడుదల చేసిన రిపోర్ట్పై దర్యాప్తు జరుపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. దీని కోసం నిరసనలు చేపడుతున్నది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ గురువారం వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఒక వ్యక్తికి పెళ్లికుమారుడి గెటప్ వేశారు. తలపాగాతోపాటు మెడలో రూ.2,000 నోట్ల దండను వేశారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తమ చేతులతో ఆ వ్యక్తిని పైకి ఎత్తారు. బారికేడ్ల అవతల ఉన్న పోలీసుల వైపునకు అతడ్ని పంపేందుకు ప్రయత్నించారు.
కాగా, ఢిల్లీ పోలీసులు దీనిని అడ్డుకున్నారు. పెళ్లికుమారుడి గెటప్లో ఉన్న వ్యక్తిని చేతులతో కాంగ్రెస్ కార్యకర్తల వైపు నెట్టారు. అలాగే శాంతంగా ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు కోరారు. వరుడి గెటప్లో ఉన్న వ్యక్తికి దెబ్బతగులవచ్చని వారించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు బుధవారం పార్లమెంట్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం వరకు నడిచి వెళ్లారు. అదానీ గ్రూప్ సంస్థలపై దర్యాప్తు కోసం ఈడీ డైరెక్టర్ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని భావించారు. అయితే ఆ కేంద్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. ఈడీ కార్యాలయం వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించిన ఎంపీలను మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు తిరిగి పార్లమెంట్కు చేరుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
#WATCH | Delhi: During Congress' protest over Adani row, one of the protesters, dressed like a groom tries to cross the barricade pic.twitter.com/nYEGKmHLVo
— ANI (@ANI) March 16, 2023
Also Read: