Loksabha Elections 2024 | ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు తాము ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఎక్కడైతే బోగస్ ఓటింగ్ జరిగిందో అక్కడ తమ కార్యకర్తలు అడ్డుకుంటారని చెప్పారు.
మెషీన్ (ఈవీఎం) ఏదైనా మెషీన్ అని, తానెప్పుడూ ఈవీఎంలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్లోని రాజ్ఘఢ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంలో మీ ఓటు ఎటు వెళ్లిందో మీరు చూడలేరని అన్నారు.
వీవీప్యాట్ మెషీన్లో సాఫ్ట్వేర్ ఉంటుందని, అసలు ఏం జరగాలనేది ఆ సాఫ్ట్వేర్ నిర్ణయిస్తుందని దిగ్విజయ్ పేర్కొన్నారు. మనం ఏం చేసినా సాఫ్ట్వేర్ తాను కోరుకున్నదే ప్రింట్ చేస్తుంది..దాన్నే ఎన్నికల అధికారులు కౌంట్ చేస్తారని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
Read More :