Revanth Reddy | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులపై చిందులేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక రకమైన భాష కొనసాగుతోందని, ఈ భాష నుంచి విముక్తి ఉందా..? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా.. ఆయన మీడియాపై రుసరుసలాడారు. ఎవరూ ఊహించని విధంగా సమాధానం ఇచ్చారు. మీడియా వాళ్లను జైల్లో వేయాలని అహంకార పూరితంగా మాట్లాడారు. ఎన్టీవీ క్వశ్చన్ అవర్కు వచ్చిన రేవంత్ రెడ్డిని ఆ టీవీ జర్నలిస్టు ఒకరు సీఎంను భాషపై ప్రశ్నించారు.
తెలంగాణలో చీరలు, లంగలు, బనియన్, డ్రాయర్ల భాష కొనసాగుతోంది. తెలంగాణ ప్రజలకు ఈ భాష నుంచి విముక్తి ఉందా..? లేదా..? అని సీఎం రేవంత్ రెడ్డిని మీడియా ప్రతినిధి అడిగారు. రేవంత్ స్పందిస్తూ.. ప్రాబ్లం మీ దగ్గరే ఉంది. మిమ్మల్ని ఒకరిద్దరిని జైలుకు పంపిస్తే కానీ సమస్య పరిష్కారం కాదు. ఇట్ల మాట్లాడగానే వాటిని ప్రసారం చేయకుండా బ్యాన్ చేయాలి. ఇలా మాట్లాడే వారిని చూపించడం బంద్ చేయాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఎక్కువ ఉంది. పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ మాది. పొలిటికల్ యాంబీషన్స్ మాకు ఉంటాయి. సామాజిక బాధ్యత అమలు చేయాల్సినోళ్లు మీరు. అలాంటి భాష మాట్లాడే వారి ప్రసంగాలను నియంత్రించాలి లేదా నిషేధించాలి. అప్పుడే ఈ సమాజానికి బాధ తప్పుద్ది అని రేవంత్ గడుసుగా సమాధానం ఇచ్చారు.
నా ఇష్టం నేను బూతులు మాట్లాడతా.. ఆ బూతులు ఎవరైనా ప్రసారం చేస్తే జైల్లో వేస్తా – రేవంత్ రెడ్డి pic.twitter.com/sht65c6F6V
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2024