హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో కొత్తపల్లి మండలం నందిగామ గ్రామంలో అలజడి సృష్టిస్తున్న చిరుతపులి ( Leopard) ఎట్టకేలకు బోనులో చిక్కింది. చిరుతపులి సంచరిస్తుందన్న సమాచారం మేరకు నారాయణపేట రేంజ్ అటవీశాఖ అధికారులు నందిగామ శివారులో చిరుత సంచరిస్తున్న ప్రదేశంలో బోను ఏర్పాటు చేశారు.
బోనులో ఎరగా ఉంచిన మేకను తినడానికి వచ్చి చిరుత బోనులో చిక్కుకుంది. దీంతో అటవీశాఖ అధికారులు చిరుతని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో(Amrabad Forests) సురక్షితంగా వదిలిపెట్టారు. ఈ ఆపరేషన్లో జిల్లా అటవీశాకాధికారివై.శ్రీనివాస్, పి.వంశీ కృష్ణ, సెక్షన్ అధికారి లక్ష్మణ్, ఇతర అటవీ సిబ్బంది పాల్గొన్నారు. చిరుతను బంధించిన అధికారులను పలువురు అభినందించారు.