బెంగళూర్ : కలలను వెంటాడి లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏ వయసులోనైనా ప్రయత్నించడంలో తప్పులేదు. బెంగళూర్కు చెందిన ఓ జంట (Viral News) ఇందుకు నిదర్శనంగా నిలిచారు. నిధి సింగ్ ఆమె భర్త శిఖర్ వీర్ సింగ్ భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలను విడిచిపెట్టడంతో పాటు సమోసాల వ్యాపారం కోసం సొంత ఇంటినీ తెగనమ్మారు. వీరి తీరుతో విస్తుపోయిన బంధువులు, స్నేహితులు నివ్వెరపోయేలా సమోసా స్టార్టప్ గ్రాండ్ సక్సెస్ అయింది.
ఉద్యోగాల్లో తాము ఎన్నటికీ కండ్లచూడని డబ్బును వీరు సమోసా బిజినెస్లో ఆర్జిస్తున్నారు. 2015లో ఉద్యోగాలకు రాజీనామా చేసిన ఈ జంట బెంగళూర్లో సమోసా సింగ్ పేరుతో ఫుడ్ స్టార్టప్ను ప్రారంభించింది. రెండేండ్లలో వీరి వ్యాపారం పలు రెట్లు పెరిగింది. ప్రస్తుతం వీరి కంపెనీ వార్షిక టర్నోవర్ రూ .45 కోట్లకు చేరింది. శిఖర్ తాను చదువుకునే రోజుల్లోనే సమోసా వ్యాపారం ప్రారంభించాలనే కోరిక ఉండేది.
ఓ రోజు శిఖర్ ఫుడ్ కోర్టులో ఉండగా ఓ బాలుడు సమోసా కోసం ఏడుస్తుండటం కనిపించింది. దేశంలోనే అత్యధికులు ఇష్టపడే స్నాక్స్లో ఒకటన సమోసా స్టార్టప్ ఏర్పాటు చేయడం సరైందని అప్పుడు అనుకున్నాడు. ఆపై ఉద్యోగాన్ని విడిచిపెట్టిన శిఖర్ సమోసా స్టార్టప్ను ప్రారంభించాడు. సమోసా సింగ్ మెనూలో కడై పనీర్ సమోసా వంటి ఎన్నో వినూత్న సమోసా ఆప్షన్స్ నోరూరిస్తాయి. ఇక తమ వ్యాపారాన్ని విస్తరించాలని సింగ్ దంపతులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Read More :