Samsung | మీరు స్మార్ట్ ఫోన్ల కోసం కొత్తగా పవర్ బ్యాంకు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకోసం గుడ్ న్యూస్ అందుబాటులోకి వచ్చింది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ అత్యధిక సామర్థ్యం గల రెండు పవర్ బ్యాంకులను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 20,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో కూడిన పవర్ బ్యాంక్, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో గల 10,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో కూడిన పవర్ బ్యాంకు వచ్చాయి.
శాంసంగ్ ఆవిష్కరించిన 20,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకు రూ.4,299లకు లభిస్తుంది. ఈ పవర్ బ్యాంకుతో ఒకేసారి మూడు స్మార్ట్ ఫోన్లు చార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. స్మార్ట్ ఫోన్లతోపాటు హెడ్ఫోన్లు, గేమింగ్ కన్సోల్స్, కెమెరాలు, లాప్టాప్లు కూడా చార్జింగ్ చేసుకోవచ్చు. ప్రీమియం లిథియం అయాన్ బ్యాటరీ గల 20000 ఎంఏహెచ్ కెపాసిటీ గల పవర్ బ్యాంకు లో కరంట్ చార్జింగ్కు మద్దతుగా ఉంటుంది. విస్త్రుత శ్రేణి స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ డివైజ్లు వాడే యూజర్ల రోజువారీ హై పవర్ డిమాండ్లు పరిష్కారం అవుతాయి.
మరోవైపు 25వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతు గల 10000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీతో పని చేసే పవర్ బ్యాంకు రూ.3,499లకే సొంతం చేసుకోవచ్చు. ఇది డ్యుయల్ పోర్ట్ చార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లతోపాటు వాచీలు, ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్, ఇతర డిజిటల్ డివైజ్ లు చార్జింగ్ చేసుకోవచ్చు. 7.5వాట్ల వైర్ లెస్ చార్జర్ సాయంతో విస్త్రుత శ్రేణి డిజిటల్ డివైజ్ లను చార్జింగ్ చేయొచ్చు. శాంసంగ్ పవర్ బ్యాంకులు బీగ్ కలర్ ఆప్షన్ లో లభిస్తాయి. అమెజాన్, శాంసంగ్ వెబ్ సైట్ ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు.