బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు (Karnataka elections) వచ్చే నెలలో జరుగనున్నాయి. ఇప్పటికే 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మార్చి 25న కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అయితే కొందరు నేతల పేర్లు ఇందులో లేవు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సోమవారం బెంగళూరు చేరుకున్నారు. క్వీన్స్ రోడ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాలో తమ నేతలకు టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మంగళవారం సమావేశం కానున్నది. వంద మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమ నేతలకు టిక్కెట్లు ఇవ్వాలంటూ పలు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. పార్టీ కార్యాలయం ఎదుట నినాదాలతో హోరెత్తించారు.
కాగా, కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీమ్ అహ్మద్ దీనిపై స్పందించారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందుకే పార్టీ టిక్కెట్ల కోసం చాలా డిమాండ్ ఉందన్నారు. సీఈసీ సమావేశం మంగళవారం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల నుంచి సర్వే నివేదికలు అందాయని చెప్పారు. ఉత్తమ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు లభిస్తాయని వెల్లడించారు.
మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గత బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. మే10న పోలింగ్ నిర్వహించి మే 13న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 20 కాగా, నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 24 అని పేర్కొంది.
#WATCH | Congress leaders and workers from various constituencies protest outside the party office in Bengaluru to demand tickets for the upcoming #KarnatakaAssemblyElections2023 pic.twitter.com/hXihZFxths
— ANI (@ANI) April 3, 2023
Also Read: