హైదరాబాద్, ఏప్రిల్27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తమ ప్రాంత అభివృద్ధి ప్రదాత కేసీఆర్ కోసం కందనూలు కదిలివచ్చింది. కల్వకుర్తిని సాకారం చేసి బీళ్లను పచ్చని మాగాణం చేసిన కృషీవలుడికి నీరాజనం పలికింది. దశాబ్దాల ఆర్తిని, దాహార్తిని తీర్చి, వలస వెతలను రూపుమాపిన నేతను కండ్లారా చూసుకొని మురిసింది.
నాగర్కర్నూలులో నిర్వహించిన బస్సు యాత్రకు అశేష ప్రజానీకం తరలివచ్చింది. యువతీ యువకులు, రైతులు, మహిళలు దారిపొడువునా రోడ్లకు ఇరువైపులా బారులుతీరి ఘనస్వాగతం పలికా రు. పబ్బతి పట్టి జేజేలు కొట్టారు. బస్టాం డ్ వద్ద చౌరస్తాలో కేసీఆర్ చేసిన రణగర్జనకు ఆ ప్రాంతమంతా ఉర్రూతలూగింది. ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్’ అన్న ముక్తకంఠంతో చేసిన నినాదాలు మిన్నంటాయి.
అభివృద్ధి ప్రదాతకు అపూర్వస్వాగతం
బీఆర్ఆర్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర శనివారం సాయంత్రం 5.10 గంటలకు మహబూబ్నగర్లోని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంటి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి భూత్పూర్, కొత్త మొల్గర, వెల్కిచర్ల, లట్లుపల్లి తండా, చేగుంట, మంగనూరు, వెలుగొండ, బిజినేపల్లి, పా లెం మీదుగా నాగర్కర్పూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడకు చేరుకున్నది.
అక్క డి నుంచి ర్యాలీగా బస్టాండ్ చౌరస్తా వరకు యాత్ర సాగింది. బస్సుయాత్రకు దారిపొడవునా కందనూలు ప్రజానీకం కిలోమీటర్ల మేర బారులు తీరి పూలుచల్లుతూ, మహిళలు మంగళహారతులు ఇచ్చారు. ప టాకులు పేల్చుతూ అభిమానం చాటుకున్నారు. భవనాలపైకి ఎక్కి చూస్తూ జనం జేజేలు పలికారు. ఆయా రూట్లలోని పల్లెవాసులు రోడ్డుపైకి చేరి నినాదాలు చేశారు. లట్లుపల్లి తండా వద్ద భారీగా గుమిగూడిన లంబాడీ ఆడబిడ్డలకు కేసీఆర్ కరచాలనం చేయగా తండావాసులు మురిసిపోయారు. దారివెంట ఆటోలు, బస్సుల్లోని ప్రజలు కేసీఆర్ను చూసేందుకు పోటీపడ్డారు.
ఎండిన వరి కంకులతో వచ్చిన రైతులు
కొందరు రైతులు ఎండిన వరి కంకులతో బస్సుయాత్రకు తరలివచ్చారు. జన నేతను చూసి తమ బాధను వ్యక్తం చేశారు. తమకు జరిగిన నష్టాన్ని వివరించారు. బస్సుయాత్రలో సెల్ఫీల కోసం ప్రజలు పోటీపడ్డారు. బస్సులోని కేసీఆర్ను ఫొటో లు తీసుకుని మురిసిపోయారు. ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. బస్సు అద్దాల నుంచే సార్ను తాకేందుకు వందలాది మంది పోటీపడ్డారు. కాంగ్రెస్ నయవంచన పాలనను ఎండగట్టిన ప్రతిసారీ ఈలలతో హోరెత్తించారు.
మోగిన గులాబీ నగారా
రాష్ట్రాన్ని సాధించినప్పుడు ఇదే ఉమ్మ డి జిల్లా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించానని, ఉద్యమ సమయంలోనూ నాగర్కర్నూల్ ప్రజలు తనతో కలిసి నడిచారని గుర్తు చేసినప్పుడు ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు. వలసల జిల్లా అభివృద్ధి చెందిందని సంతోషించానని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ పాత రోజులు వస్తాయేమో అని ఆందోళన కలుగుతున్నదని కేసీఆర్ తెలిపారు. పదేండ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడి తే వాటికి కాంగ్రెస్ సరార్ మంగళం పా డుతున్నదని కేసీఆర్ అన్నప్పుడు ‘అవు ను.. అవును’ అన్న ప్రజల మాటలు ప్రతిధ్వనించాయి.
రైతులను ఉద్దేశించి ‘మీకు రైతుబంధు వచ్చిందా’ అని కేసీఆర్ ప్రశ్నించినప్పుడు ‘రాలేదు.. రాలేదు’ అంటూ నినదించారు. ‘ఇదిగో ఇది ప్రజలనాడి విను… రేవంత్రెడ్డి’ అని కేసీఆర్ గుర్తు చేశారు. ‘మీలో ఒకడు, ఆలంపూర్ ముద్దుబిడ్డ, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఐపీఎస్కు రాజీనామా చేసి ప్రజాసేవ చేయడా నికిముందు కొచ్చాడని, ఆయన్ను ఎంపీగా గెలుపించుకుంటారా?’ అని కేసీఆర్ ప్రశ్నించినప్పుడు ‘గెలిపిస్తాం.. అం టూ’ చేతులూపారు. కేసీఆర్ ప్రసంగం ప్ర జలను ఆలోచింపజేసేలా సాగింది. కార్యకర్తల్లో ఉత్సాహం, ఉత్తేజాన్ని నింపింది.
నాగర్కర్నూలు రూపురేఖలు మార్చిన జననేతకు జేజేలు
కేసీఆర్ పదేండ్ల పాలనలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాధించిన ప్రగతికి నిలువెత్తు నిదర్శనంగా నాగర్కర్నూలు జిల్లా నిలుస్తుంది. ప్రత్యేక జిల్లా కావడమే కాకుండా అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించింది. దశాబ్దాలుగా పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కేసీఆర్ హయాంలో రన్నింగ్ ప్రాజెక్టుగా మారింది. వెరసి బీళ్లన్నీ పచ్చని మాగాణాలుగా మారాయి.
మెడికల్, అగ్రికల్చర్ కాలేజీలు సహా ఇతర ఉన్నత విద్యాసంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా కందనూలు రూపురేఖలే మారిపోయాయి. తాగునీటి కష్టాలు దూరమయ్యాయి. కానీ ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ రైతుల జీవితాలను ఆగం చేస్తుండటంతో, హామీలకు ఎగనామం పెట్టేందుకు యత్నిస్తుండడంతో గులాబీ అధినేత మరోసారి రణగర్జన చేశారు. బస్సుయాత్ర చేపట్టి ‘నేనున్నాను’ అంటూ భరోసా కల్పించారు.