బ్రస్సెల్స్: మురుగునీటి కాలువ కోసం తవ్వుతుండగా, రూ.90 కోట్ల విలువైన బంగారు నిధి బయటపడ్డ ఘటన బెల్జియంలో జరిగింది. దేశ రాజధాని బ్రస్సెల్స్కు 18 మైళ్ల ఉత్తరాన ఉన్న డెండర్మొండోలో మురుగునీటి కాలువ పైపు వేసేందుకు కార్మికులు ఒక భవనం పునాదిని తొలగించగా, బంగారు కడ్డీలు, బంగారు నాణేలు బయటపడ్డాయి. తొలుత వాటిని 1 యూరో నాణేలుగా అనుకున్నారు.
నాణేలు లభ్యమైన పాత భవనం బెల్జియానికి చెందిన ఒక చారిటీ సంస్థది అని అధికారులు తెలిపారు. లభ్యమైన నిధిలో 49 బంగారు కడ్డీలతో పాటు బకెట్ నిండా బంగారు నాణేలు ఉన్నాయి. కాగా, బెల్జియం చట్టాల ప్రకారం ఆ నిధిని సంబంధిత యజమానికే అప్పగిస్తారు. నిధి దొరికిన ఐదేండ్ల కాలంలో దానిని అతడు క్లెయిమ్ చేసుకోవచ్చు. లేకపోతే దానిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది.