P Chidambaram | రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయావకాశాల గురించి సీనియర్ కాంగ్రెస్ (Congress) నేత పి. చిదంబరం (P Chidambaram) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ గత లోక్సభ ఎన్నికలకంటే ఎక్కువ సీట్లే ఈ ఎన్నికల్లో గెలుస్తుందని (More Seats In 2024) ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘ఇండియా’ కూటమి అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
శనివారం ఉదయం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ.. ‘నేను అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడలేను. కానీ తమిళనాడులో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ఫ్రంట్ 20 సీట్లను గెలుస్తాయి. అక్కడ బీజేపీ ఒక్కసీటు కూడా గెలవకపోవచ్చు. ఇక కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజాదరణ పొందాయి. 2019 కంటే కాంగ్రెస్కు ఈసారి ఎక్కువ సీట్లే వస్తాయి’ అని చిదంబరం చెప్పుకొచ్చారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ మెరుగైన పనితీరును కనబరుస్తుందని అన్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఢిల్లీలో ‘ఇండియా’ కూటమికి మంచి ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.
Also Read..
BJP Manifesto | బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్కు ముహూర్తం ఖరారు..!
Sonu Sood | షూ దొంగిలించిన స్విగ్గీ డెలివరీ బాయ్కి అండగా నిలిచిన రియల్ హీరో సోనూ సూద్
Mallikarjun Kharge | ముందు మీ చరిత్ర చూసుకోండి.. మోదీకి ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్