BJP Manifesto | దేశంలో లోక్సభ ఎన్నికల (Lok Sabha polls) హడావుడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షిచేందుకు రకరకాల హామీలు ఇస్తున్నాయి. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా రోడ్షోలు, సభలు నిర్వహిస్తున్నారు. ఈ పదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.
ఇక ఇప్పుడు కమలం పార్టీ లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆదివారం అంటే ఏప్రిల్ 14వ తేదీన ‘సంకల్ప్ పత్ర’ (Sankalp Patra) పేరుతో మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు సదరు వర్గాలు తాజాగా వెల్లడించాయి. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు ‘న్యాయ పత్ర’ పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి ధీటుగా బీజేపీ రేపు మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితర బీజేపీ పెద్దలు ఈ సంకల్ప పత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.
Also Read..
Terrorists | పాక్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మందిని హతమార్చి
Sonu Sood | షూ దొంగిలించిన స్విగ్గీ డెలివరీ బాయ్కి అండగా నిలిచిన రియల్ హీరో సోనూ సూద్