Mallikarjun Kharge : మోదీ పదేండ్ల హయాంలో ఏకంగా 2.5 కోట్ల చిన్న మధ్యతరహా సంస్ధలు (ఎంఎస్ఎంఈ) మూతపడ్డాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో 1.3 కోట్ల ఎంఎస్ఎంఈలు పెరిగితే మోదీ హయాంలో మూసివేతలు చోటుచేసుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ చెబుతున్న మాటలెలా ఉన్నా ఎంఎస్ఎంఈకి బీజేపీ సరికొత్త నిర్వచనం ఇచ్చిందని అన్నారు.
మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కు మినిమం సపోర్ట్ అని కాషాయ పాలకులు ఎంఎస్ఎంఈని నిర్వఛిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం నోట్ల ఉపసంహరణ, లోపభూయిష్ట జీఎస్టీ, లాక్డౌన్ల కారణంగా చిన్న పరిశ్రములు చితికిపోయిన మాట వాస్తవం కాదా అని ఎక్స్ వేదికగా మల్లికార్జున్ ఖర్గే నిలదీశారు.
ఎంఎస్ఎంఈల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఈ పదేండ్లలో ఎందుకు మారలేదని ప్రశ్నించారు. 2013-14 కాంగ్రెస్ హయాంలో ఎంఎస్ఎంఈల్లో 11.14 కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి పొందగా 2022-23 (మోదీ ప్రభుత్వ హయాం)లో ఉద్యోగుల సంఖ్య 11.1 కోట్లుగా ఉందని గుర్తుచేశారు. 2020, మే 12న ప్రధాని నరేంద్ర మోదీ రూ. 20 లక్షల కోట్లతో ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక ప్యాకేజ్ను ప్రకటించారు. ఆ ప్యాకేజ్ అతీగతీ లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు.
Read More
Prabhas | మై బ్రదర్.. నేను నమ్మలేకపోతున్నా.. The Goat Life ట్రైలర్పై ప్రభాస్