P Chidambaram | కొత్త వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న 5, 12, 18, 28 శాతం స్లాబుల్లో 12, 28 శాతం స్లాబులను తీసేశారు. ఈ నెల 22 నుంచి మారిన స్లాబుల ప్రకారం ఆయా వస్తూత్పత్తులపై నూతన పన్ను రేట్లు వర్తించనున్నాయని బుధవారం ఇక్కడ జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ పి. చిదంబరం (P Chidambaram) తాజాగా స్పందించారు. జీఎస్టీ హేతుబద్ధీకరణ, రేట్లు తగ్గించడాన్ని స్వాగతించారు.
ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఎనిమిదేళ్లు ఎందుకు పట్టిందంటూ విమర్శలు గుప్పించారు. ఇంతకాలం తర్వాత ప్రభుత్వం హఠాత్తుగా ఈ మార్పులు చేయడానికి గల కారణాలపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మందగించిన ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న కుటుంబ అప్పులు, పడిపోతున్న పొదుపు, త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలు లేదా అమెరికా టారిఫ్ల ఒత్తిడి.. జీఎస్టీ రేట్ల తగ్గింపుకు వీటన్నింటిలో ఏదో ఒక కారణమా..? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్లో వరుస పోస్టులు పెట్టారు. అయితే, తాజా నిర్ణయంతో పేద, మధ్యతరగతి వర్గాలకు కొంత ఉపశమనం లభిస్తుందని చిదంబరం అభిప్రాయపడ్డారు.
Also Read..
వ్యక్తిగత బీమాపై నో జీఎస్టీ.. ఇక 5, 18 శాతం స్లాబులే..
Union Cabinet | కేంద్ర కేబినెట్ సమావేశం.. 70వేల మందికి ఉపాధి అవకాశాలు..!
Gold Price | పసిడి పరుగో పరుగు.. తొలిసారిగా రికార్డుస్థాయిలో రూ.1.07లక్షలకు..!