చెన్నై : ప్రధాని నరేంద్ర మోదీతో సరితూగే వ్యక్తి లేరంటూ చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (Karti Chidambaram) చిక్కుల్లో పడ్డారు. తమిళనాడు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ కార్తీ చిదంబరానికి నోటీసులు జారీ చేసింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని నిలువరించడం కష్టమని ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీ చిదంబరం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
ఆ ఇంటర్వ్యూలో మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని దీటుగా ఎదుర్కోగలరా అని ప్రశ్నించగా కార్తీ చిదంబరం బదులిస్తూ మోదీని ఎవరూ ఢీకొనలేరని అన్నారు. ప్రస్తుత ప్రచార ఆర్భాటం చూస్తుంటే మోదీకి సరితూగేవారు ఏ ఒక్కరూ లేరని చెప్పారు. రాహుల్ గాంధీ మోదీని ఢీకొనేందుకు సరైన వ్యక్తేనా అని అడగ్గా ఇప్పటి ప్రచార హోరు చూస్తుంటే ప్రధానిగా మోదీకి ఉన్న సహజసిద్ధమైన అనుకూలతల పరంగా రాహుల్ దీటై పోటీ ఇవ్వడం కష్టమేనని కార్తీ చిదంబరం అన్నారు.
ఇక కార్తీ వ్యాఖ్యలు పార్టీకి ఆగ్రహం కలిగించడంతో ఆయనకు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు కార్తీ తరచుగా ఈవీఎంలకు మద్దతు తెలపడం పట్ల కూడా పార్టీ విముఖత వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పలు సందర్భాల్లో ఈవీఎంలను వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
Read More :
Tattoos of Ram | భక్తుల ఒంటిపై శ్రీరాముడి పచ్చబొట్లు.. ఉచితంగా వేస్తున్న టాటూ ఆర్టిస్ట్