నాగ్పూర్: అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు మూహూర్తం దగ్గరపడుతున్నది. ఈ నెల 22న అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ఈ నేపథ్యంలో శ్రీరాముడిపై భక్తితోనో, ప్రచారం కోసమో ఎవరికి తోచిన ప్రయత్నాలు, ప్రయోగాలు వారు చేస్తున్నారు.
గుజరాత్కు చెందిన జైలంగానియా వెండి ఉంగరంపై ఆయోధ్య నమూనాను డిజైన్ చేయగా.. ఇప్పుడు మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన హృతిక్ రాజేంద్ర దారొడే (22) అనే కళాకారుడు 1,001 మందికి ఉచితంగా పచ్చబొట్లు (టాటూలు) వేయాలని సంకల్పించుకున్నాడు.
రాముడి వివిధ రూపాలను భక్తుల చేతులు, ఛాతీ, భుజాలపై అందంగా డిజైన్ చేస్తున్నాడు. ఒక్కో టాటూకు హృతిక్ దారొడేకు రూ.350 ఖర్చవుతుంది. వెయ్యిమందికి కలిపి సుమారు రూ.3.5 లక్షల భారం పడనుంది.