Amit Shah | కర్ణాటకలో రాజకీయాలు (Karnataka Politics) హీటెక్కాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Assembly Elections) సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలకు ఎక్కుపెట్టారు. ఈ క్రమంలో బీజేపీ (BJP) నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా (Amit Shah).. కాంగ్రెస్ (Congress) పార్టీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా షా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటకలో అల్లర్లు జరుగుతాయి’ అంటూ వ్యాఖ్యానించారు.
షా వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సుర్జేవాలా (Randeep Singh Surjewala), డా.పరమేశ్వర్, డీకే శివకుమార్ (DK Shivakumar).. బెంగళూరు (Bengaluru)లోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ (High Grounds police station) లో ఫిర్యాదు చేశారు. అమిత్ షా ఎన్నికల ప్రచారంలో ద్వేషపూరిత ప్రసంగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘అమిత్ షా ఎన్నికల ప్రచారంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తున్నారు. ప్రతిపక్షాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం బాగాల్కోట్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుటుంబ రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటాయి. కర్ణాటక అల్లర్లతో అతలాకుతలం అవుతుంది. కాంగ్రెస్కు పొరపాటున ఓటు వేసినా రాష్ట్రంలో అవినీతి మునుపెన్నడూ చూడని స్థాయికి చేరుకుంటుంది’ అంటూ షా వ్యాఖ్యానించారు.
కాగా, కర్ణాటకలో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్కు 75, జేడీఎస్కు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి.
Karnataka | Congress leaders Randeep Singh Surjewala, Dr Parmeshwar and DK Shivakumar file police complaint in Bengaluru's High Grounds police station against Union Home Minister & BJP leader Amit Shah and organisers of BJP rally for allegedly making "provocative statements,… pic.twitter.com/cxp4GfKnVd
— ANI (@ANI) April 27, 2023
Also Read..
Chrisann Pereira | డ్రగ్స్ కేసులో అరెస్ట్.. షార్జా జైలు నుంచి విడుదలైన బాలీవుడ్ నటి
Angry Tiger | పార్క్లో టూరిస్ట్లపైకి దూసుకొచ్చిన పులి.. వీడియో వైరల్..!
Rahul Gandhi | రాహుల్ గాంధీ పరువు నష్టం కేసు విచారణ నుంచి తప్పుకున్న జడ్జి