Lok Sabha Polls | రానున్న లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Polls) కాంగ్రెస్ (Congress), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య పొత్తు కుదిరినట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా సీట్ల సర్దుబాటు (seat-sharing)పై పలు దఫాల చర్చల అనంతరం ఇరు పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఢిల్లీ సహా హర్యానా, చండీగఢ్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్-ఆప్ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి.
రెండు పార్టీల మధ్య పొత్తుపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆప్- కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఐదు రాష్ట్రాల పొత్తును ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ (Jairam Ramesh) కూడా ధృవీకరించారు. లోక్సభ ఎన్నికల కోసం ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల ఒప్పందంపై నేడు అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపారు.
ఢిల్లీలో ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైన విషయం తెలిసిందే. ఢిల్లీలో పాలక ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. ఢిల్లీలో సీట్ల సర్దుబాటు ఖరారైన క్రమంలో గుజరాత్, గోవా, హర్యానా రాష్ట్రాల్లోనూ పొత్తుపై నేతలు చర్చించినట్లు తెలిసింది. గుజరాత్లో రెండు లోక్సభ స్థానాల్లో, హర్యానాలో ఒక స్థానంలో ఆప్ పోటీ చేయనుంది. ఇక పంజాబ్లో ఇరు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉండబోదని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. పంజాబ్లో మొత్తం 13 స్థానాల్లో ఆప్ బరిలో దిగుతుందని చెప్పారు. అయితే మిగిలిన రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై నేడు అధికారిక ప్రకటన వెలువడనుంది.
Also Read..
Manipur | మణిపూర్ యూనివర్సిటీలో బాంబు పేలుడు.. వ్యక్తి మృతి
K Hoysala | గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి.. మైదానంలోనే కుప్పకూలి
Manchu Manoj | తండ్రి కాబోతున్న మంచు మనోజ్.. బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన భూమా మౌనిక